News December 26, 2025
రామచంద్రపురంలో విజిలెన్స్ కమిటీ సమీక్ష.. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఆరా!

రామచంద్రపురంలో శుక్రవారం సబ్ డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్డీఓ అఖిల, డీఎస్పీ రఘువీర్ అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసులు, వసతి గృహాల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం వహించరాదని, సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Similar News
News December 29, 2025
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. వాళ్లిద్దరికీ రెస్ట్?

న్యూజిలాండ్తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని cricbuzz తెలిపింది. అయితే ODIలకు దూరమైనా NZతో 5T20ల సిరీస్లో మాత్రం ఆడతారని పేర్కొంది. జనవరి 11-31 మధ్య 3 ODIలు, 5T20లు జరగనున్నాయి. ODIల్లో వెటరన్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడనున్నారు.
News December 29, 2025
ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.
News December 29, 2025
హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

<


