News March 23, 2025
రామచంద్రపురం: కేజీ చికెన్ ఎంతంటే?

రామచంద్రపురం మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.130, బాయిలర్ కేజీ రూ. 200, ఫారం కేజీ రూ.స్కిన్ లెస్ (బాయిలర్) కేజీ రూ.240కి విక్రయిస్తున్నట్లు చోడవరం బైపాస్ వద్ద చికెన్ అమ్మకదారులు తెలిపారు. ఆదివారం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయాలు చేస్తున్నామని వారు చెప్పారు. మరి మీ ప్రాంతంలో ఎంతో కామెంట్ చేయండి.
Similar News
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
News November 6, 2025
ఎనుమాములలో తగ్గిన పత్తి ధర

గురునానక్ జయంతి సందర్భంగా బంద్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభమైంది.
సోమవారం ₹6,920, మంగళవారం ₹6,950 పలికిన ధర, ఈరోజు ₹6,900కి పడిపోయింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు నేటి నుంచి పత్తి కొనుగోలు చేయమని కాటన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలతో కొనుగోళ్లు తిరిగి పునఃప్రారంభించారు.
News November 6, 2025
HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.


