News December 30, 2025
రామచంద్రపురం: సంక్రాంతికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లేవారి కోసం హెచ్ఈఎల్ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులు జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు నడుస్తాయి. ఆర్సీపురం నుంచి బయలుదేరే ఈ బస్సులు బయలుదేరనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
Similar News
News December 30, 2025
యూరియా కోసం క్యూలో ఉండక్కర్లేదు: అదనపు కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
3.27 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ధాన్యం కొనుగోలు: కలెక్టర్

రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతోందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న 348 కేంద్రాల ద్వారా పారదర్శకంగా సేకరణ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు సుమారు 63 వేల మంది రైతులు తమ పంటను విక్రయించారని, వారి ఖాతాల్లోకి రూ.782.59 కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు.
News December 30, 2025
రేపు బయటికి రావద్దు!

ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉదయం, రాత్రివేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పింది. ఇక 31st కావడంతో పార్టీలు చేసుకునేవారూ ఇళ్లలోనే ఉండటం బెటర్. రేపు HYDతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో పోలీసులు పెద్దఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించినవారు వాహనాలపై బయటికి రావద్దని సూచిస్తున్నారు.


