News April 2, 2025
రామచంద్రపురం: స్నానానికి దిగి విద్యార్థి మృతి

రామచంద్రపురం మండలం వెల్ల లాకుల వద్ద మంగళవారం కాలువలోకి స్నానానికి దిగి పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఎలమంచిలి అఖిల్ (15) పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పరీక్షలు పూర్తి కావడంతో స్నేహితులతో కలిసి పంట కాలువలో స్నానానికి దిగారు. కాలువలో నీటి ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో అఖిల్ కొట్టుకుపోయాడు. సాయంత్రానికి మృతదేహం లభించింది.
Similar News
News April 5, 2025
HYD: WGL రూట్.. భువనగిరి టోల్ గేట్ రేట్లు..!

✓కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వాహనం ఒక వైపు రూ.125, అప్, డౌన్ రూ.190 ✓లైట్ కమర్షియల్, గూడ్స్ వాహనం, మినీ బస్సు రూ.205, అప్&డౌన్ రూ.305 ✓బస్సు ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్& డౌన్ రూ.635 ✓కమర్షియల్ వాహనం ఒక వైపు రూ.465, అప్ & డౌన్ రూ.695✓HCM, EME వాహనం ఒకవైపు రూ.665, అప్ & డౌన్ రూ.1,000✓ ఓవర్ సైజ్ వాహనం ఒక వైపు రూ.810, అప్ & డౌన్ రూ.1,215✓ నెలవారీ పాస్ ధర రూ.340 నుంచి ప్రారంభమవుతాయి.
News April 5, 2025
SRPT SP కార్యాలయంలో జగ్జీవన్ జయంతి

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నరసింహ బాబూ జగ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు.
News April 5, 2025
మేడ్చల్: 16 వేలు దాటిన దరఖాస్తులు..!

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ‘యువ వికాస పథకం’ దరఖాస్తుల సంఖ్య 16 వేల మార్క్ దాటినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.