News March 19, 2025
రామచంద్రాపురం: బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

రావులపాలెం నుంచి సాలూరుకి వెళ్లే ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ రామాలయం వద్ద బైక్పై వెళ్తున్న పల్లి జీవరత్నం(71) అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో వెంటనే స్థానికులు అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని మార్చురీకి పంపించారు.
Similar News
News December 30, 2025
సంగారెడ్డి జిల్లా రైతులకు కలెక్టర్ ముఖ్య గమనిక

సంగారెడ్డి జిల్లాలో 4,766 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సహకార సంఘాల వద్ద 444 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 3,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పూర్తి స్థాయి యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
News December 30, 2025
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంక ఉమెన్స్ టీమ్తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్తో రాణించారు.
News December 30, 2025
సిద్దిపేట: ప్రాణం తీసిన బురద..!

మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కూలీ బురద నీటిలో పడి, ఊపిరాడక మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ఐ కీర్తిరాజు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జోగు ప్రభాకర్(45) గ్రామంలో కూలి పని చేస్తూ, భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. పొలంలో ఒడ్డు చెక్కేందుకు పనికి వెళ్లి.. పనిచేస్తూ, మూర్ఛ రావడంతో బురదలో బోర్లా పడి మరణించాడు.


