News September 24, 2024

రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. 3న విష్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో ఉత్సవాలు ప్రారంభమౌతాయి. 9వ తేదీన స్వామి వారి కళ్యాణం, 12వ తేదీన పూర్ణాహుతి, చక్రస్నానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News October 12, 2024

విజయనగరం: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన

image

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని విజయనగరం రూరల్ మండలం గోపాలపురం వద్ద అందుబాటులో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. దీంతో జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

News October 11, 2024

సిరిమానోత్సవంపై కలెక్టర్ సమీక్ష

image

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అన్ని సంప్రదాయాలను పాటిస్తూ భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్‌లో అమ్మవారి పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అమ్మవారి సిరిమాను వద్ద పని చేసే సిబ్బంది 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ప్రారంభం అయ్యేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 5 గంటలలోగా జాతర పూర్తవ్వాలన్నారు.

News October 11, 2024

VZM: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ‘1912’

image

విజయనగరం జిల్లాలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఇంటి వద్ద నుండే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని విద్యుత్ శాఖ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ‘1912’ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి రైతు యొక్క ఆధార్, పాస్ బుక్, సర్వే నంబర్, ఫామ్ -3, మొబైల్ నంబర్ వివరాలను కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు తెలపాలన్నారు.