News April 6, 2025
రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
Similar News
News April 7, 2025
వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు చెందిన ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.
News April 5, 2025
VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.
News April 5, 2025
VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్లు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన క్యూఆర్ కోడ్ ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకులను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్బీ ఆఫీసు సమీపంలోని అన్న క్యాంటీన్కు రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం, విజయనగరం ప్రకాశం పార్కులోని క్యాంటీన్కు ఏడో స్థానం, ఘోషా ఆసుపత్రిలోని అన్న క్యాంటిన్కు పదో స్థానం దక్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.