News March 5, 2025
రామప్ప: ఈ బావి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప ఆలయ ఆవరణలో ఉన్న కాకతీయుల కాలంనాటి బావి నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. సుమారు 800 ఏళ్ల క్రితం తవ్విన ఈ బావి గోడలు పొడవైన, వెడల్పైన శిలలతో నిర్మించారు. ఈ బావిలోని నీటిని తాగితే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. రామప్ప ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు ఈ నీటిలో వేస్తే తేలుతాయి. రామప్ప సందర్శించిన పర్యాటకులు ఈ బావిని చూసి మంత్రముగ్ధులవుతారు.
Similar News
News November 15, 2025
HOCLలో 72 పోస్టులు

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ (HOCL)72 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్సైట్: www.hoclindia.com/
News November 15, 2025
సమాజ పరిశుభద్రత ఎంతో అవసరం: కలెక్టర్

ప్రస్తుత సమాజంలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘వ్యక్తిగత, సమాజ పరిశుభద్రత”’ ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
News November 15, 2025
లక్నోకు అర్జున్, షమీ.. DCకి నితీశ్ రాణా

ఐపీఎల్ రిటెన్షన్ గడువు నేటితో ముగుస్తుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ట్రేడ్ చేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ నుంచి సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ లక్నోకు వెళ్లారు. సన్రైజర్స్ బౌలర్ షమీ కూడా LSG జట్టులో చేరారు. అటు రాజస్థాన్ రాయల్స్ను వీడిన నితీశ్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్లో చేరారు. KKR ప్లేయర్ మయాంక్ మార్కండేను ముంబై ట్రేడ్ చేసుకుంది.


