News March 20, 2024
రామభద్రపురం: అత్యాచారం కేసులో జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710942963303-normal-WIFI.webp)
రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన ఓ యువతిపై ముదిలి కృష్ణ అనే వ్యక్తి 2017లో అత్యాచారం కేసు నమోదయ్యింది. 11 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి పద్మావతి బుధవారం తీర్పు వెలువరించినట్లు స్థానిక ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. 2017లో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వాదనలు పూర్తైన పిదప న్యాయమూర్తి బుధవారం తుది తీర్పు వెల్లడించారు.
Similar News
News July 5, 2024
VZM: పోస్టింగులకు కార్యదర్శుల ఎదురు చూపులు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720150154731-normal-WIFI.webp)
సరిగ్గా మూడు నెలల క్రితం జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 ఉద్యోగులుగా పదోన్నతి లభించింది. ఇప్పటికీ కూడా వారికి పోస్టింగులు ఇవ్వకపోవడంతో ఎదురు చూస్తున్నారు. మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు అడ్డొచ్చాయి. కోడ్ ముగిసి నెల దాటుతున్నా పోస్టింగులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
News July 5, 2024
‘APEPDCL యాప్లో బిల్లులు చెల్లించాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720146833099-normal-WIFI.webp)
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్తు బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ల ద్వారా చెల్లించవద్దని ఏపీఈపీడీసీఎల్ సహాయ గణాంక అధికారిణి ఎం.కుసుమకుమారి ఒక ప్రకటనలో సూచించారు. వినియోగదారుల APEPDCL యాప్ను డౌన్లోడ్ చేసుకుని లేదా సంబంధిత డిస్కం వెబ్ సైట్లో బిల్లులు చెల్లించాలని సూచించారు.
News July 5, 2024
VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720149263129-normal-WIFI.webp)
సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.