News April 12, 2024

రాములోరి కళ్యాణానికి జానకీ సదనం సిద్ధం..!

image

భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం సౌమిత్రీ సదనం సమీపంలో రూ.3.6 కోట్లతో గ్రౌండ్‌ ప్లస్‌ 2పద్ధతిలో 34 గదులను నిర్మించారు. దీనికి జానకీ సదనం అని పేరు నిర్ణయించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉండగా వీలైనంత తొందరగా పూర్తిచేసి 17న ప్రారంభించాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సత్రాలకు తోడు ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సదుపాయం మెరుగుపడనుంది.

Similar News

News October 11, 2024

KMM: ‘ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలి’

image

రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగు పరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.

News October 10, 2024

ఖమ్మం: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి

image

కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, 9 రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి, సమైక్య స్పూర్తిని చాటే సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

News October 10, 2024

దసరాకు వంతెనపై రాకపోకలు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల

image

దసరా పండుగ లోపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లోలెవల్ కాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్‌లో పర్యటించి టీ.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.