News April 10, 2025

రాయచోటిలో గ్యాంగ్ వార్.. 9 మంది అరెస్ట్

image

రాయచోటిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పరారీలో వున్న మరో 15 మంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల నుంచి 5 కట్టెలు, 3ఇనుప రాడ్లు, ఒక చైను, 9 సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో10రోజుల క్రితం శివాలయం వద్ద ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Similar News

News April 18, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో ‘Quality for downloaded photos and videos’ ఫీచర్ రానుంది. దీని ద్వారా మీడియా ఫైల్స్‌ను నచ్చిన క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ లేదా హై క్వాలిటీ ఆప్షన్‌లలో నచ్చిన దానిని ఎంచుకోవాలి. మీరు స్టాండర్డ్ క్వాలిటీ పెట్టుకుంటే అవతలి వ్యక్తి HDలో పంపినా మీకు స్టాండర్డ్ క్వాలిటీలోనే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. తద్వారా డేటా సేవ్ అవుతుంది. డౌన్‌లోడ్ స్పీడూ పెరుగుతుంది.

News April 18, 2025

నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

image

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.

News April 18, 2025

పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

image

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.

error: Content is protected !!