News April 11, 2024

రాయచోటిలో రమేశ్ రెడ్డి ప్రభావం ఎంత?

image

మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి తొలిసారి 1999లో లక్కిరెడ్డిపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి గడికోట మోహన్ రెడ్డిపై 10,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో మోహన్ రెడ్డి చేతిలో 13,052 ఓట్లతో ఓడిపోయారు. 2014, 19లో రాయచోటిలో పరాజయం పాలయ్యారు. 2019లో 66,128 ఓట్లు, 2014లో 62,109 ఓట్లు సాధించిన ఆయన టీడీపీకి రాజీనామా చేయడం తాజా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి మరి.

Similar News

News February 15, 2026

కడప: ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర

image

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.

News February 14, 2026

కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

image

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్‌లైన్‌లో POLO, WALLA యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News February 14, 2026

గండికోటకు వెళ్తున్న ప్రేమ జంటకు ప్రమాదం.. యువతి మృతి.!

image

కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.