News September 20, 2025

రాయచోటిలో వర్ష బీభత్సం.. ముగ్గురి మృతి

image

రాయచోటిలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసి పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న తల్లీ, బిడ్డ షేక్ మున్నీ(27), ఇలియాస్ (6)ను కాపాడబోయి మరో వ్యక్తి వంగల గణేశ్ (30) మృతి చెందాడు. రామాపురం వద్ద స్కూల్ ఆటోలో నుంచి దూకేసి మాధవరం ఆరవ వాండ్లపల్లికి చెందిన ఆరవ యామిని (8) డ్రైన్ కాలువలో కొట్టుకుపోయింది. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News September 20, 2025

సీఎం నిర్ణయంతో ఉల్లి రైతుల‌కు భారీ ఊరట: మంత్రి భరత్

image

క‌ర్నూలు జిల్లా ఉల్లి రైతుల‌ను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటంచడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్ర‌బాబుకు మంత్రి కృత‌జ్న‌త‌లు తెలిపారు. ధ‌ర‌ల ప‌త‌నంతో న‌ష్ట‌పోతున్న రైతుల‌కు ఇది ఊర‌ట‌నిచ్చే నిర్ణ‌య‌మ‌ని అన్నారు. ఉల్లి రైతుల ఇబ్బందుల‌పై సీఎం చంద్ర‌బాబు తొలి నుంచి సమీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News September 20, 2025

NLG: పండుగల వేళ.. ధరల షాక్

image

జిల్లాలో పండుగల ముందు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకు నూనెలు, బియ్యం, కూరగాయల ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మొదలు కానుంది. ఆ తర్వాత పది రోజుల్లోనే దసరా పండుగ ఉంది. ఈ సమయంలో ధరల పెరుగుదల సామాన్య జనంలో ఆందోళన రేపుతున్నది. పల్లీ నూనె రూ.190 వరకు విక్రయిస్తున్నారు. కందిపప్పు KG రూ.220కు పైగానే ఉన్నది.

News September 20, 2025

YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

image

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.