News August 30, 2024
రాయచోటి: ఆగస్టు 31న పింఛన్ల పంపిణీ

సెప్టెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 31వ తేదీన పెన్షన్లు అందకపోతే సెప్టెంబరు 2వ తేదీన పింఛన్లు అందజేస్తామన్నారు. 2 వ తేదీ తర్వాత పింఛన్లు అందవని, కావున పింఛనర్లు ఈ నెల 31న గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News December 17, 2025
ఖాజీపేట: కానిస్టేబుల్ జాబ్ కొట్టిన హోమ్ గార్డు కుమారుడు

ఖాజీపేట పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్గా పనిచేస్తున్న ప్రసాద్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో సీఐ వంశీధర్ పవన్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ యూనిఫామ్ అందజేశారు. విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ఉన్నతంగా రాణించాలని సూచించారు.
News December 17, 2025
కడప: శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్ అందజేత

మహిళల వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన మన కడప జిల్లా మహిళా క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత చెక్కును మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉండవల్లిలో బుధవారం ఆమె అందుకున్నారు. కడపలో ఇంటి స్థలం, గ్రేడ్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఆమెకు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
News December 17, 2025
కడప జిల్లాలో ‘ఫేస్ వాష్ అండ్ గో’

కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రాత్రి వేళ పలుచోట్ల వాహనాలను నిలిపారు. లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లకు నీరు అందించి ఫేస్ వాష్ చేయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


