News March 29, 2024
రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711677794938-normal-WIFI.webp)
చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News July 5, 2024
ఢిల్లీలో తప్పిపోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720177707122-normal-WIFI.webp)
ఢిల్లీలో కనిపించకుండా పోయిన బాలిక ముద్దనూరులో ప్రత్యక్షమైంది. సీఐ దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల మొహంతి కాంతు ఢిల్లీ నుంచి పారిపోయి ముద్దనూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు సీఐ సహాయం కోరారు. దాదాపు 2 గంటల సర్చ్ ఆపరేషన్ తర్వాత ఆ అమ్మాయితో పాటు వచ్చిన మహమ్మద్ రెహ్మాన్ల జాడ కనుక్కొని ఢిల్లీ పోలీసులకు అప్పచెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2024
గువ్వలచెరువు ఘాట్ సొరంగ మార్గానికి రూ.1000 కోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164542643-normal-WIFI.webp)
కడప – రాయచోటి మార్గమధ్యలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వాహనదారుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ప్రమాదకరంగా ఉండే ఈ ఘాట్కు ప్రత్యామ్నాయంగా.. ఆ కొండకు సొరంగం తవ్వి, నాలుగు వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్రం రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 14 జాతీయ రహదారులకు రూ.4,744 కోట్లతో 2024-25 వార్షిక ప్రణాళికకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
News July 5, 2024
రేపు కడపకు రానున్న YS జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161534435-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.