News July 11, 2025

రాయపర్తి: తల్లి చెంతకు వచ్చి వెళ్తుండగా అనంత లోకాలకు!

image

తల్లి చెంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా కుమారుడు అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామంలో అందరిని కలచివేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాడిపెళ్లి వెంకటయ్య-రజిత దంపతుల కుమారుడు రంజిత్(24) హైదరాబాదులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి గ్రామంలోనే ఉంటోంది. తల్లిని చూసి తిరిగి వెళ్తుండగా పాలకుర్తిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.

Similar News

News July 11, 2025

ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

image

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.

News July 11, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* AP: ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న CM చంద్రబాబు
* రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు: హోంమంత్రి అనిత
* శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
* TG: మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.. దరఖాస్తు తేదీ(ఈ నెల 20-27 వరకు) మార్పు
* కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మరణాలు
* కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ముందుకు మరోసారి హరీశ్ రావు

News July 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలి: రఘునందన్

image

సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల లాగానే ఎంపీలు కూడా ప్రజలచే ఎంపికైన ప్రజాప్రతినిధులేనని, వారికి కూడా లబ్ధిదారుల ఎంపికలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం గతంలో ఎంపీగా చేశారు కాబట్టి, ఎంపీల ప్రాధాన్యత గురించి ఆయనకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు.