News February 28, 2025

రాయపోల్: దీపం అంటుకొని ఇళ్లు దగ్ధం.. రోడ్డున పడిన కుటుంబం

image

విద్యుత్ ప్రమాదంలో పెంకుటిళ్లు దగ్ధమైన ఘటన రాయపోల్ మండలం పెద్దఆరేపల్లిలో రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోంపల్లి శంకరయ్య భార్య లలితతో పాటు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రి ఇంట్లో దేవతలకు దీపం వెలిగించి ఇంటి బయట నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోఇళ్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Similar News

News February 28, 2025

ప్రకాశం: 3 నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో మార్చి 3వ తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నేరుగా డౌన్లోడ్ చేసుకుని వెళ్లినా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామన్నారు.

News February 28, 2025

బంగ్లా పుస్తకాల్లో ఇందిర ఫొటోలు తొలగింపు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.

News February 28, 2025

ఒంగోలు: రేపటి నుంచి కొత్త ఫైన్లు..!

image

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మార్చి ఒకటో తేదీ నుంచి భారీ ఫైన్లు తప్పవని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. ఫైన్ వివరాలను ఆయన వెల్లడించారు.
➤ హెల్మెట్(బైకుపై ఇద్దరికీ), ఇన్సూరెన్స్ లేకుంటే: రూ.1000
➤ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే: రూ.10వేలు
➤ బైక్ రేసింగ్(ఓవర్ స్పీడ్): రూ.5 వేలు
➤ మైనర్ డ్రైవింగ్: రూ.1000
➤ డేంజరస్ పార్కింగ్: రూ.1500-రూ.3వేలు
➤ శబ్ద కాలుష్యం చేస్తే: రూ.2వేలు-రూ.4వేలు

error: Content is protected !!