News April 15, 2025

రాయవరం: కొడుకు మృతి.. తల్లడిల్లిన తల్లి హృదయం

image

తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన కుమారుడి ఫలితం కోసం చూస్తున్నారు. అంతలోనే కొడుకు మరణ వార్తతో షాకయ్యారు. సోమేశ్వరం పరధిలో జరిగిన ప్రమాదంలో సందీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహం వద్ద తల్లి ఆర్తనాధాలు అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు.

Similar News

News September 18, 2025

సంగారెడ్డి: ఉపాధ్యాయులను భర్తీ చేయాలని వినతి

image

జిల్లాలో ఉపాధ్యాయ ప్రమోషన్‌తో మిగిలిపోయిన పోస్టులను తదుపరి సీనియార్టీ జాబితాతో భర్తీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో వెంకటేశ్వర్లకు గురువారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

News September 18, 2025

మంచిర్యాల: ‘మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి’

image

మంచిర్యాల పట్టణంలో గురువారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ.. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెదురు బొంగులు ఉచితంగా సరఫరా చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు.

News September 18, 2025

ఆందోల్: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి: మంత్రి

image

నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజానర్సింహా పేర్కొన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పటిష్ఠ పర్చాలని మంత్రి దిశానిర్దేశం చేసారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఎండీ తదితరులు పాల్గొన్నారు.