News December 30, 2025

రాయికల్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేయిలింగ్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలోని భూపతిపూర్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. చింతలూరుకు చెందిన భూమేష్(22), దినేష్(18) బైకుపై వెళ్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న భూమేష్ రోడ్డు పక్కనున్న రేయిలింగ్‌ను గుద్దాడు. దీంతో బండి స్కిడై భూమేష్ మృతి చెందాడు. దినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 2, 2026

282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. 18ఏళ్లు నిండిన విద్యార్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://cscspv.in

News January 2, 2026

నరసరావుపేట: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్

image

యూనియన్ బ్యాంక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ నీలోఫర్ తెలిపారు. నరసరావుపేట మండలం రావిపాడులో జనవరి 5 నుంచి మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగ్ వర్క్స్‌లో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. పది, ఆపైన చదివిన పల్నాడు జిల్లా యువత అర్హులని అన్నారు.

News January 2, 2026

పవన్‌ హక్కుల ఉల్లంఘన పోస్టులు తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు

image

AP Dy CM <<18640929>>పవన్<<>> కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. SM వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది.