News March 25, 2025

రాయికల్: అక్రమ ఆయుధం విక్రయ యత్నం.. పట్టుకున్న పోలీసులు

image

అక్రమ ఆయుధాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు SI సుధీర్ రావు తెలిపారు. SI వివరాలిలా.. UP కి చెందిన పవన్, సునీల్ లు రాయికల్ (m) బషీర్ పల్లెలో ఉంటూ లేబర్ పని చేస్తూ బతుకుతున్నారు. వారు UP నుండి అక్రమంగా ఒక తపంచా తెచ్చారు. సునీల్ తపంచాను అమ్మమని పవన్‌కు ఇచ్చి వెళ్ళాడు. పవన్ రామాజీపేటలో నేడు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా తపంచా, లైన్ రౌండ్ పట్టుకొని సీజ్ చేశారు.

Similar News

News September 16, 2025

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

image

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.

News September 16, 2025

రాష్ట్రంలో రోడ్ల కోసం రూ.868 కోట్లు మంజూరు

image

TG: రాష్ట్రానికి సెంట్రల్ రోడ్&ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ’34 రోడ్డు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయాభివృద్ధిపై కేంద్రం నిబద్ధతతో ఉంది’ అని తెలిపారు.

News September 16, 2025

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. అదేవిధంగా, కామారెడ్డి, దేవునిపల్లి, దోమకొండ ప్రాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన మరో 8 మందికి కోర్టు మొత్తం రూ.8,000 జరిమానా విధించింది.