News September 2, 2025
రాయికల్: ‘రెండేళ్లు గడుస్తున్నా పెన్షన్లు పెంచలేదు’

రాయికల్ పట్టణ కేంద్రంలో దివ్యాంగుల, వృద్ధుల, చేయూత, పెన్షన్ దార్ల మహా గర్జన సన్నాక సదస్సును సోమవారం MRPS అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 9న హైదరాబాదులో జరిగే మహాగర్జన సభకు భారీ ఎత్తున ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 4, 2025
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
News September 4, 2025
HYD: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా డాక్టర్ గడ్డం వెంకన్న

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్న రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తమ అధ్యాపకుల జాబితా వెల్లడించింది. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వెంకన్న పురస్కారం అందుకోనున్నారు.
News September 4, 2025
నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైంది: మోదీ

దేశం స్వావలంబన సాధించాలని, నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్ విజయంతో సైంటిస్టులు కావాలనే కాంక్ష విద్యార్థుల్లో పెరిగిందని చెప్పారు. ‘టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. యువతరానికి దారి చూపాలి. చిన్నారుల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గేమింగ్, గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది’ అని PM వివరించారు.