News January 29, 2025

రావికమతం: వరినూర్పు యంత్రం పడి ఇద్దరి మృతి

image

రావికమతం ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మాడుగుల మండలం వమ్మలి గ్రామానికి చెందిన వరినూర్పుల వాహనం మాకవరపాలెం వెళ్లింది. మంగళవారం రాత్రి తిరిగి వస్తూండగా రావికమతం మెయిన్ రోడ్డు మలుపు వద్ద ట్రాక్టర్ వెనుక కట్టిన యంత్రం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాడుగుల(M) వమ్మలికి చెందిన జే.గణేశ్ (65), జే.నాయుడు (50) మృతి చెందారు. ఎస్ఐ రఘువర్మ ఘటనాస్థలికి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 17, 2026

దేవుడిపైనే భారం: మిచెల్ మార్ష్

image

శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా <<19162360>>ఓడిపోవడం<<>>పై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ‘మంచి స్టార్టింగ్ వచ్చినా కొన్ని పరుగులు తక్కువ చేశాం. కానీ స్కోరును డిఫెండ్ చేసుకోవచ్చని అనుకున్నాం. శ్రీలంక బాగా ఆడింది. ఇక దేవుడిపైనే భారం. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్‌ను ఆశతో చూస్తాం. ప్రస్తుతం నిరాశలో ఉన్నాం’ అని మ్యాచ్ అనంతరం చెప్పారు. జింబాబ్వే గెలుపోటములపైనే ఆసీస్ S-8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

News February 17, 2026

ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

image

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే మరణం
1954: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జననం
1963: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ జననం
1983: సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణం
1984: క్రికెట్ ప్లేయర్ డివిలియర్స్ జననం
1984: సినీ నటి సదా జననం
1986: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఓఎస్ విడుదల

News February 17, 2026

పాక్‌లో ‘Money Heist’.. 700 తులాల బంగారం చోరీ!

image

పాకిస్థాన్‌లోని కరాచీలో ‘మనీ హీస్ట్’ తరహా భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలో 300 మిలియన్ల PKR విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. షాపు వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. 700 తులాల బంగారు కడ్డీలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దొంగలకు ఈ ప్రాంతంపై పట్టుందని, ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.