News October 24, 2025
రావులపాలెం: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 24, 2025
తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్ను సంప్రదించాలన్నారు.
News October 24, 2025
ANU: పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన నానో టెక్నాలజీ IV, V ఇయర్స్ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 4వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News October 24, 2025
పత్తి సేకరణలో సందేహాలు నివృత్తి చేయాలి: కలెక్టర్

పత్తి రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. పత్తి, ధాన్యం కొనుగోలు పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రైతు సేవా కేంద్రం వారిగా రైతులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాంతాల వారీగా పత్తి ఉత్పాదకత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలన్నారు.


