News June 27, 2024

రావులపాలెం: కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా ప్రమోషన్

image

రావులపాలెం పట్టణం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్  వైకుంఠరావుకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. 1990లో కానిస్టేబుల్‌గా చేరిన ఆయన 34 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకోగా ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జేమ్స్ రత్నప్రసాద్, ఇతర సిబ్బంది వైకుంఠరావును అభినందించారు. ఇప్పటివరకు ఆయన సర్వీసులో ఎటువంటి రిమార్క్ లేకుండా పని చేశారని కొనియాడారు.

Similar News

News July 1, 2024

క్యాంపు కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్

image

కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం, చేబ్రోలు హైవే పక్కన ఉన్న ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు కలెక్టర్ శన్మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి భరణి, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

News July 1, 2024

తూ.గో.: పవన్ కళ్యాణ్ ENTRY

image

డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా పిఠాపురం నియోజకవర్గానికి బయలుదేరారు. గొల్లప్రోలు మండలంలో ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

News July 1, 2024

తూ.గో.: పిల్లలు పుట్టడం లేదని సూసైడ్

image

తూ.గో. జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట రాశి (24) నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన దుర్గారావును ప్రేమవివాహం చేసుకుంది. కాగా పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆదివారం కాలువలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి తల్లి మంగ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.