News February 4, 2025

రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్

image

రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్ నిలిచింది. రెండు గ్రామ పంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్‌పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.

Similar News

News November 5, 2025

బాడంగి: వేగావతి నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతి

image

బాడంగి మండలంలో మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఆనవరం గ్రామానికి చెందిన అంపవల్లి సంతు (31) కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం వేగావతి నదిలో స్నానానికి దిగింది. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయి కారాడ దగ్గర తేలింది. ప్రాణాలతో ఉండటంతో చికిత్స నిమిత్తం బంధువులు బాడంగి CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

News November 5, 2025

గోదావరిఖని: అక్టోబర్‌ నెలలో షీటీంకు 69 ఫిర్యాదులు

image

రామగుండం కమిషనరేట్‌ పరిధిలో అక్టోబర్‌ నెలలో మొత్తం 69 ఫిర్యాదులు వచ్చాయని సీపీ అంబర్‌ కిషోర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థినులు షీ టీమ్స్‌ నంబర్లు 6303923700 (కమిషనరేట్‌), 8712659386 (పెద్దపల్లి), 8712659386 (మంచిర్యాల)ను సంప్రదించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ ఎల్లప్పుడూ పని చేస్తాయని తెలిపారు.

News November 5, 2025

శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

image

శ్రీశైలంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన గుడి పరిసరాలు, నంది మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.