News January 23, 2026
రాష్ట్రంలోనే తొలిసారి నగరిలో..!

నెట్ జీరో క్యాంపస్ కాన్సెప్ట్ను ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో తొలిసారి నగరి బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లలో అమలు చేయనున్నారు. ఇక్కడ ఎల్ఈడీ బల్బులు, 12 కిలోవాట్ల సోలార్ రూఫ్టాప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తడి వ్యర్థాల నుంచి కంపోస్టు తయారీ చేస్తారు. వర్షపు నీటిని నిల్వ చేసి.. నీటి వృథాను తగ్గిస్తారు. పచ్చదనం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు పూర్వ DMHOకు మెమో

కొవిడ్ 3వ దశ సన్నాహకాల్లో వైద్యుల నియామకం, హోం క్వారంటైన్ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని అప్పటి చిత్తూరు DMHO శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం శాఖాపర చర్యలను ప్రారంభించింది. UPHCల్లో ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో, 183 మంది సపోర్టింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ద్వారా నియమించామని శ్రీహరి రిప్లై ఇవ్వడంతో ఆ చర్యలను నిలిపేసింది. పారదర్శకంగా విధులు నిర్వహించాలని మెమో జారీ చేసింది.
News February 19, 2026
చిత్తూరు: వాటర్ ప్లాంట్లకు రూ.10లక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈవోలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పీఎం శ్రీ నిధులను మార్చిలోపు వినియోగించాలన్నారు. పనితీరు సక్రమంగా లేని HMలను మారుస్తామని హెచ్చరించారు.
News February 19, 2026
చిత్తూరు: వాటర్ ప్లాంట్లకు రూ.10లక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈవోలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల మంజూరు చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పీఎం శ్రీ నిధులను మార్చిలోపు వినియోగించాలన్నారు. పనితీరు సక్రమంగా లేని HMలను మారుస్తామని హెచ్చరించారు.


