News September 11, 2024
రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 11, 2025
MBNR: మూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
News March 10, 2025
MBNR: చెక్డ్యామ్లో పడి గొర్రెల కాపరి మృతి

చిన్నచింతకుంట మండలంలో చెక్డ్యామ్లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 10, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.