News March 13, 2025
రాష్ట్రంలోనే రెండో స్థానంలో గోదూర్

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరులో 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో గోదూర్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అటు మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జరుగుతున్నారు.
Similar News
News March 14, 2025
అమెరికన్ NRIs బీకేర్ఫుల్… లేదంటే!

అమెరికాలో NRIలు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మాస్ డీపోర్టేషన్ కోసం వార్టైమ్ ఏలియన్స్ చట్టాన్ని ట్రంప్ ప్రతిపాదిస్తుండటం, గ్రీన్కార్డు హోల్డర్స్ శాశ్వత నివాసులు కాదని VP JD వాన్స్ చెప్పడాన్ని వారు ఉదహరిస్తున్నారు. లీగల్గా అక్కడికి వెళ్లినా తొలి ప్రాధాన్యం వైట్స్కేనని అంటున్నారు. తాము చెప్పినట్టు నడుచుకోకుంటే తరిమేస్తామన్న ట్రంప్ పాలకవర్గం మాటల్ని గుర్తుచేస్తున్నారు. COMMENT.
News March 14, 2025
మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్కు దక్కింది.
News March 14, 2025
నిర్మల్: హంటర్కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

జిల్లా పోలీస్ శాఖకు విశేష సేవలు అందించిన హంటర్ జాగిలం అనారోగ్యంతో మృతి చెందగా గురువారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పలు హత్యలు దొంగతనాల కేసులను ఛేధించడంలో హంటర్ విశేష ప్రతిభను అందించిందని, పోలీసు శాఖకు అందించిన సేవలు వెలకట్టలేవని తెలిపారు.