News January 11, 2026
రాష్ట్రంలో నెల్లూరుకు మొదటి స్థానం

జిల్లా మ్యూజియంకు రాష్ట్రంలో మొదటి స్థానం దక్కిన్నట్లు మ్యూజియం ఇన్ఛార్జ్ శివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 5 జిల్లా సైన్స్ మ్యూజియం కేంద్రాలు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు సైన్స్ మ్యూజియం చూసేందుకు వచ్చిన సందర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు – 10 వేలు, కడప – 854, ఏలూరు – 3,540, చిత్తూరు – 4,000, అనంతపురం – 5,636 మంది సందర్శించారు.
Similar News
News February 19, 2026
ఆత్మకూరులో నేడే మెగా జాబ్ మేళా

ఆత్మకూరు ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 25 కంపెనీలు పాల్గొంటున్న ఈ మేళాలో 1400పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద జాబ్ మేళా జరగనుంది.
News February 19, 2026
ప్రభుత్వానికి కాకాణి సవాల్

ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ నిధులు హెరిటేజ్కు మళ్లించారనే అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, 22–ఏ భూముల అంశాలపై చర్చకు సిద్ధమని, ప్రభుత్వం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.
News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.


