News December 24, 2025
రాష్ట్రంలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు

AP: రాష్ట్రంలో కొత్తగా 4 చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు ఆయా కార్పొరేషన్లు డిస్కంలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి. తన సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులను PPP విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ఈ ప్లాంట్లు ఉన్నాయి.
Similar News
News January 2, 2026
ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.
News January 2, 2026
282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. 18ఏళ్లు నిండిన విద్యార్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://cscspv.in
News January 2, 2026
పవన్ హక్కుల ఉల్లంఘన పోస్టులు తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు

AP Dy CM <<18640929>>పవన్<<>> కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. SM వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్ను తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది.


