News July 30, 2024
రాష్ట్రంలో 5, 6 స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి

పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి వాటిని బాధితులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. 20 ఏప్రిల్ 2023 నుంచి 14 జులై 2024 వరకు NZB కమిషనరేట్లో 6,690 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,941 గుర్తించి 1,888 ఫోన్లను బాధితులకు అందించారు. కామారెడ్డి జిల్లాలో 4,917 కేసులు నమోదు కాగా 2,756 సెల్ ఫోన్లు గుర్తించారు.
Similar News
News January 27, 2026
నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News January 27, 2026
నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.
News January 27, 2026
NZB: రూ.782.31 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.782.31 కోట్లు రుణ మాఫీ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నాలుగు విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు మాఫీ చేశారన్నారు. అలాగే రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.15.40 కోట్ల నేరుగా జమ చేసినట్లు వివరించారు.


