News February 10, 2025

రాష్ట్రంలో 60 శాతం అల్లూరి జిల్లా వాటా: కలెక్టర్

image

గిరిజన రైతులు పండిస్తున్న సంప్రదాయ దేశీయ పసుపు సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో పసుపు సాగులో అల్లూరి సీతారామరాజు జిల్లా 60 శాతం వాటాను ఆక్రమించిందన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులపై డిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. గిరిజన రైతులు సేంద్రియ పసుపును సాగు చేస్తున్నారన్నారు. పసుపు సాగులో గిరిజన రైతులకు మెలకువలపై అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.

Similar News

News December 14, 2025

మహబూబాబాద్: 5వ సారి ఆ కుటుంబానికే సర్పంచ్ పదవి

image

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మినేని మంజుల ఘన విజయం సాధించారు. వరుసగా 5వ సారి ఆ కుటుంబానికే గ్రామస్థులు పట్టం కట్టారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన కొమ్మినేని రాములమ్మ పై 260 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 10 వార్డులు, కాంగ్రెస్ 2 వార్డుల్లో విజయం సాధించింది.

News December 14, 2025

తిమ్మాజిపేట: టాస్‌తో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకయపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మద్దతుగల ఆలేటి ఇందిరా, ప్రత్యర్థి కుప్పిరెడ్డి వెంకటేశ్వరమ్మ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొత్తం 543 ఓటర్లు ఉండగా, 472 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలవడంతో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో టాస్ నిర్వహించారు. అదృష్టం ఆలేటి ఇందిరాను వరించింది.

News December 14, 2025

ధర్మసాగర్: సర్పంచులు వీరే!

image

ధర్మసాగర్ మండలం ధర్మపురంలో BRS బలపరిచిన అభ్యర్థి రమాదేవి విజయం సాధించారు. అలాగే దేవునూరు గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి ఇంగె రవి గులాబీ జెండా ఎగరేశారు. మరోవైపు కరుణాపురంలో సైతం గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ BRS బలపరిచిన అభ్యర్థి గుర్రపు రీనా గెలుపు ముంగిట నిలిచారు. కడియం శ్రీహరి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ గ్రామాల్లో గులాబీ జెండా ఎగరడం పట్ల BRS నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.