News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

Similar News

News September 16, 2025

ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేనా…?

image

నెల్లూరు జిల్లాలో ఎడగారుగా 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. కోతలు కోసే సమయానికి వర్షాలు పడడంతో పలుచోట్ల పంట పొలాలు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News September 16, 2025

నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్‌లు

image

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చింది. బైజూస్‌తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్‌లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్‌లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.

News September 16, 2025

నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

image

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.