News December 21, 2025
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.
Similar News
News December 26, 2025
జగన్ ట్వీట్తో రంగా అభిమానుల్లో కొత్త చర్చ!

AP: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా YCP చీఫ్ జగన్ ప్రత్యేకంగా <<18674822>>ట్వీట్<<>> చేయడం చర్చకు దారితీసింది. రంగా కుమారుడు రాధా YCPని వీడి గతంలో TDPలో చేరారు. తాజాగా కుమార్తె ఆశాకిరణ్ యాక్టివ్ అయ్యారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఓసారి ఆమెను మీడియా అడగ్గా రాధారంగా మిత్రమండలి సలహాతో నడుస్తానన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలని YCP ఆసక్తితో ఉందా? అనే సందేహాలు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
News December 26, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(<
News December 26, 2025
మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.


