News December 26, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్స్ నిజామాబాద్ జిల్లా వాసులు

తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, సాయిలు టెక్నికల్ అఫీషియల్స్గా నియమితులయ్యారు. ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరగనున్న 72వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల, మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్-2025 పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం పట్ల ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారం తదితరులు అభినందించారు.
Similar News
News December 29, 2025
నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కలు ఇవే!

నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్లో 60 వార్డులు ఉండగా 3,11,152 జనాభా ఉంది. అందులో SCలు 23,788, STలు 3,425 ఉన్నారు. బోధన్లో 38 వార్డుల్లో 82,744 జనాభా ఉండగా SCలు 6,704, STలు 890 ఉన్నారు. ఆర్మూర్లో 36 వార్డుల్లో 67,252 మంది ఉండగా ఎస్సీలు 5,625, ఎస్టీలు 886 నమోదయ్యారు. భీమ్గల్లో 12 వార్డుల్లో 15,446 మంది ఉండగా ఎస్సీలు 1,957, ఎస్టీలు 696 ఉన్నారు.
News December 29, 2025
NZB: 21 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.
News December 29, 2025
నిజామాబాద్: ప్రజావాణికి 93 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 93 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


