News October 9, 2024

రాష్ట్రస్థాయి జట్టుకు శావల్యాపురం విద్యార్థిని ఎంపిక

image

శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.కావ్య బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్‌లో నాగపూర్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో కావ్య పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి విద్యార్థినిని అభినందించారు.

Similar News

News October 10, 2024

గుంటూరులో జాతీయ స్థాయి పర్యవేక్షణ బృందం పర్యటన

image

కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన సాధారణ పర్యవేక్షణ 2024-2025 సంవత్సరానికి(దశ-1) నిర్వహించటానికి జాతీయస్థాయి పర్యవేక్షకులు బుధవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్యకాంత, కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. అనంతరం కలెక్టర్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

News October 10, 2024

T20 క్రికెట్ టోర్నమెంట్‌లో మంగళగిరి అమ్మాయి

image

ఈ నెల 17 నుంచి బరోడా వేదికగా జరిగే ఇండియా సీనియర్ మహిళా T20 టోర్నమెంట్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మహిళ క్రికెట్ టీంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గత నెల సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఢిల్లీలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ ఐపీఎల్ టీం సెలక్షన్ ట్రైల్‌కి హాజరయ్యారు. మంగళగిరి నుంచి ఎంపికైన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి పావనికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News October 9, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌డెడ్

image

నల్లపాడు – అంకిరెడ్డిపాలెం రహదారిలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు మార్జిన్‌లో ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని కింద పడ్డాడు. ఈ క్రమంలో కారు ఆ వ్యక్తి తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. మృతుడు గుర్రాల మరియదాసు (60)గా గుర్తించారు.