News October 11, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు తాడిపత్రి విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్ర స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలకు తాడిపత్రికి చెందిన 7వ తరగతి విద్యార్థిని అస్రున్ ఎంపికైనట్లు కోచ్ మధు తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన జిల్లాస్థాయి SGFI స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో అండర్ -14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందన్నారు. ఎంపికైన విద్యార్థిని అస్రున్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Similar News

News October 11, 2025

అనంత: గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

image

అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందారు. తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 11, 2025

అనంతపురంలో కిలో టమాటా రూ.19

image

అనంతపురం శివారులోని కక్కలపల్లి మార్కెట్ యార్డ్‌లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠంగా కిలో రూ.19, కనిష్ఠ ధర రూ.10, సరాసరి ధర రూ.14తో అమ్ముడుపోతున్నట్లు రాప్తాడు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 1,650 టన్నుల టమాటా వచ్చినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 10, 2025

APPSC బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ శశిధర్ నియామకం

image

APPSC బోర్డు ఛైర్మన్‌గా ప్రొఫెసర్ సి.శశిధర్ నియమితులయ్యారు. ఈయన అనంతపురం JNTUలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 2000-06 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 2006-12 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా, 2012 నుంచి ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో సీఎం చంద్రబాబు చేతుల మీదగా బెస్ట్ ప్రొఫెసర్ అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్బంగా JNTUలోని విద్యార్థులు ఆయనను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.