News February 2, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో జన్నారం విద్యార్థిని ప్రతిభ

జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.అరవిందరాణి రాష్ట్రస్థాయి ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో సత్తా చాటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన ఉపన్యాస పోటీలు ఆమె తృతీయ బహుమతి సాధించారని HM రాజన్న తెలిపారు. దీంతో విద్యార్థిని అరవింద రాణిని, గైడ్ టీచర్, ఉపాధ్యాయుడు కమలాకర్ను ఆయన అభినందించారు.
Similar News
News February 26, 2026
సంగారెడ్డి: పెన్షన్ పెంపు కోసం పోరాటం తప్పదు: NPRD

సంగారెడ్డి గణేష్ నగర్లో ఎన్పీఆర్డీ(NPRD) 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ పెంపు, బడ్జెట్లో నిధుల కేటాయింపు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News February 26, 2026
KNR: పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన SU రిజిస్ట్రార్

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ & పిజి కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు.సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.
News February 26, 2026
ఖమ్మం: ప్రతిపక్షాల దాడి.. అధికార పక్షం తడబాటు

వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 8 ఏళ్లుగా నలుగుతున్న ఈ అంశంలో రాత్రికి రాత్రి వేలాది మంది పోలీసులతో కూల్చివేతలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక పాత్ర పోషించిన RDO నర్సింహారావు ఆకస్మిక బదిలీ రాజకీయంగా దుమారం రేపింది.


