News February 19, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన సిద్దిపేట క్రీడాకారులు

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, ఎనిమిది బ్రోంజ్ మెడల్ పథకాలు సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు నారన్నగారి రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి ఉన్నారు.
Similar News
News July 4, 2025
కూటమిపై ప్రజలకు నమ్మకం పోయింది: అమర్నాథ్

కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ఆ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సబ్బవరంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ.. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ టైటిల్ బాబుకి సరిగ్గా సరిపోతుందన్నారు. అర్హులకు పెన్షన్లు అందడం లేదన్నారు.
News July 4, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు
News July 4, 2025
వనపర్తి: పోలీస్ డ్యూటీమీట్లో పతకాలు సాధించిన వారికి అభినందన

జోగులాంబ జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్లో వనపర్తి జిల్లాకు బంగారు 4, రజత 4, కాంస్య 5 మొత్తం 13 పతకాలు సాధించారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ అభినందించారు. నాగర్ కర్నూల్లో 2 రోజులపాటు నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో ఈ పతకాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలన్నారు.