News March 21, 2025
రాష్ట్రస్థాయి మేళాపై కలెక్టర్ సమన్వయ సన్నాహక సమావేశం

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్ర స్థాయి మేళాపై కలెక్టర్ సత్య శారద వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సన్నహక సమావేశం నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర స్థాయి మేళ జిల్లాలో మార్చి 25 నుంచి 27 వరకు నిర్వహించినట్లు తెలిపారు. మేళాలో రైతు ఉత్పత్తి దారుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.
Similar News
News March 22, 2025
ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.
News March 22, 2025
ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నుంచి ఫీజు వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ధన కిషోర్ ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీం కింద ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు 41,443 దరఖాస్తులు రాగా.. అందులో 18,943 మంజూరు చేయగా, 100% ఫీజు వసూల్ చేయాలన్నారు.
News March 22, 2025
కక్కిరాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కక్కిరాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ ఏఐ టూల్స్ను నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్ను ఆపరేట్ చేస్తుండగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధించిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్ను కలెక్టర్ పరిశీలించారు.