News August 25, 2025
రాష్ట్రస్థాయి యోగ పోటీలకు వేంపేట విద్యార్థులు

రాష్టస్థాయి యోగా పోటీలకు వేంపేట ZPHS విద్యార్థులు ఎంపికయ్యారు. జగిత్యాల యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీలలో చుక్కబొట్ల హేమచంద్ర ప్రథమ స్థానంలో నిలువగా, శ్రీరాముల కార్తికేయ ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వచ్చేనెల 5, 6, 7 తేదీలలో నిర్మల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. వారిని ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి తదితరులు అభినందించారు.
Similar News
News August 26, 2025
KMR: హత్యాయత్నం కేసులో.. ముగ్గురికి మూడేళ్ల జైలు

హత్యాయత్నం కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు KMR ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. 2021లో బిచ్కుంద మండలం ఖత్గాంకు చెందిన చందును పాత కక్షల కారణంగా రాథోడ్ శంకర్, రాథోడ్ మారుతి, గణేశ్లు దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వీరిని కోర్టులో హాజరుపరచగా సోమవారం తీర్పు వెలువరించారు.
News August 26, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News August 26, 2025
మా పాలనలో దాదాపు 2 లక్షల టీచర్ల నియామకం: TDP

AP: డీఎస్సీకి పర్యాయపదంగా తమ పార్టీ మారిందని టీడీపీ ట్వీట్ చేసింది. TDP పాలనలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టీచర్ల నియామకాలు చేసి చరిత్ర సృష్టించినట్లు Xలో పేర్కొంది. 1994లో 16,238 డీఎస్సీ ఉద్యోగాలతో మొదలైన ప్రస్థానం ఇంకా కొనసాగుతోందని తెలిపింది. లిమిటెడ్, స్పెషల్ రిక్రూట్మెంట్లతో కలపి 1,96,619 ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది.