News September 22, 2024
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కాపుశంభం విద్యార్థినిలు
సెప్టెంబర్ చివరి వారంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జెడ్పీ హెచ్ స్కూల్ కాపుశంభం విద్యార్థినిలు ఆర్.అనూష, ఈ.జెనీలియా, పి భవాని ఎంపికైనట్లు స్కూల్ హెచ్.ఎం రాము శనివారం తెలియజేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొండవెలగాడలో జరిగిన జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో ప్రతిభను చూపి విజయం సాధించారన్నారు. పోటీలకు ఎంపికైన వారిని అభినందించారు.
Similar News
News September 21, 2024
పార్వతీపురంలో మెగా జాబ్ మేళా: కలెక్టర్ శ్యామ్
ఈ నెల 24వ తేదీన పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యులకు అవంతి ఫీడ్స్, అరబిందో ఫార్మా, GMR రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 21, 2024
VZM: రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ డీఐజీగా నాగలక్ష్మి
రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ డీఐజీగా ఎ.నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె కాకినాడ నుంచి విజయనగరం బదిలీపై వచ్చారు. గతంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజిస్ట్రార్గా పని చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని రిజిస్ట్రార్గా కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.
News September 21, 2024
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊరట లభించింది. ముడి పదార్థాల కొరత కారణంగా ఉత్పత్తి తగ్గించుకున్న దీనికి మరో రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే గురువారం రూ.500 కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. మొదట విడుదల చేసిన నిధులను కేవలం చట్టబద్ధమైన చెల్లింపులకే వినియోగించాలని షరతు పెట్టింది. ఆ నిధుల వినియోగం బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది.