News February 10, 2025
రాష్ట్ర గంగపుత్ర సదస్సులో నిర్మల్ జిల్లా విద్యార్థులు

హైదరాబాద్లో జరుగుతున్న రాష్ట్ర గంగపుత్ర విద్యార్థుల సదస్సులో ఆదివారం రెండో రోజు నిర్మల్ జిల్లా గంగపుత్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యావంతులు పరిష్కరించే విధంగా అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలైన గ్రూప్ 1,2,3 వంటి పోటీ పరీక్షలతో పాటు స్వయం ఉపాధి, కుల వృత్తుల వంటి వాటిలో యువతను ప్రోత్సహించే విధంగా మెలుకువలను అందించారు.
Similar News
News February 21, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. డివిజనల్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే స్కానింగ్ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతో పాటు, జరిమానాలు, క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. లింగ వివక్ష నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News February 21, 2026
తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News February 21, 2026
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.


