News March 18, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

image

ఉమ్మడి కరీంనగర్,​ మెదక్,​ నిజామాబాద్,​ ఆదిలాబాద్​ టీచర్స్​ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మను కలిశారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌కు విద్యారంగ, టీచర్ల సమస్యలు విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Similar News

News November 15, 2025

జగిత్యాల: వృద్ధాశ్రమంలో క్రీడా పోటీలు నిర్వహణ

image

వృద్ధ తల్లిదండ్రుల పోషణ–సంక్షేమ చట్టం వృద్ధులకు పెద్ద ఆసరా అవుతోందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. అనాధ వృద్ధాశ్రమంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు, చదరంగం, పచ్చీసు, క్యారమ్ వంటి క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వృద్ధులను నిరాదరిస్తే 3 నెలల జైలు, జరిమానా విధించే అధికారం ఆర్డీవోకు ఉందని ఆయన తెలిపారు.

News November 15, 2025

బాసర: వంతెన‌పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

image

బాసర మండలం టాక్లి గ్రామానికి చెందిన చిల్లేవాడ్ హమ్మీబాయి(55) గ్రామ శివారులోని వాగు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆమె కుమారుడు శ్రీనివాస్ వాగులో దూకి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. మహిళ మృతదేహం నీటిలో తెలియాడుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

KTDM: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా పోలీసులు!

image

మావోయిస్టు ప్రాంత ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చెప్పారు. చర్ల మండలం ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలైన బక్కచింతలపాడు, కిష్టారంపాడు, వీరాపురం, రాళ్లపురం, తిమ్మిరిగూడెం, కమలాపురంలో పర్యటించి సూచనలు చేశారు.