News December 2, 2025
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి: YCP

AP: CBN ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో అవి కొండల్లా పేరుకుపోతున్నాయని YCP ఆరోపించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా నిధులు పేరుకుపోయాయని విమర్శించింది. ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద రూ.5,600కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.2,200కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. దీంతో విద్యార్థులకు చదువుతో పాటు భోజనం కూడా దక్కని పరిస్థితి నెలకొందని ట్వీట్ చేసింది.
Similar News
News April 15, 2026
యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.
News April 15, 2026
GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)
News April 15, 2026
నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి: సంగక్కర

2009 పాక్ పర్యటనలో తమ బస్సుపై జరిగిన ఉగ్రదాడి గురించి శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. ‘మేం గ్రౌండ్కు బయల్దేరాం. బాంబు పేలి ఇంటికి తిరిగి వెళ్లిపోతే బాగుండని ఓ బౌలర్ అన్నాడు. నిమిషం కూడా గడవకముందే మాపై దాడి జరిగింది. నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సంగక్కర, మెండిస్, సమరవీర, తరంగ, లక్మల్, తుషార గాయపడ్డారు.


