News April 13, 2025

రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు

image

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన ఆదర్శ రైతు కారుమంచి షేక్ అహ్మద్ కుమారుడు షేక్ ఆసిఫ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. బైపీసీలో 440/430 మార్కులు సాధించి టాప్-10లో చోటుసాధించారు. విద్యార్థిని లెక్చరర్లు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఆసిఫ్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వైద్య విద్య పూర్తి చేసి గ్రామస్థులకు సేవలందిస్తానని చెప్పారు.

Similar News

News April 14, 2025

టీటీడీ గోశాల‌పై అసత్య ప్ర‌చారాలు: మంత్రి TB

image

కోట్లాదిమంది ప్ర‌జ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా టీటీడీపై వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మాట్లాడ‌టం త‌గ‌ద‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం శాఖ మంత్రి టీజీ భ‌రత్ అన్నారు. ఆవుల మ‌ర‌ణాల‌పై భూమ‌న వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ ఆదివారం మంత్రి టీజీ భ‌ర‌త్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తీతీదే ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు ఎన్డీయే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌న్నారు.

News April 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు
➤మంత్రాలయంలో టూరిజం అభివృద్ధికి చర్యలు
➤ఆదోని MLA నోరు అదుపులో ఉంచుకోవాలి: ఆలూరు వైసీపీ నాయకులు
➤క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో విద్యార్థిని ప్రతిభ
➤ దేవనకొండ మండలంలో మహిళ ఆత్మహత్య
➤ హఫీజ్ ఖాన్ కు YS జగన్ కీలక పదవి!
➤ సాధారణ రైతు కూతురు కళాశాల టాపర్
➤ కర్నూలులో 50 తులాల బంగారం చోరీ?
➤ రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు.

News April 13, 2025

 కర్నూలు: KGBV విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

image

ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో కేజీబీవీలలో విద్యార్థులకు ప్రభుత్వం సన్ షైన్ స్టార్ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు చెందిన పంచలింగాలకు చెందిన కేజీబీవీ పాఠశాల విద్యార్థిని మానస, కేజీబీవీ ఓర్వకల్లుకు చెందిన హరిత, గూడూరు కేజీబీవీ చెందిన సునీతలు ఎంపికయ్యారు. వారికి ఈనెల 15వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

error: Content is protected !!