News April 10, 2025
రికార్డుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి: కలెక్టర్

తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్తు మరమ్మత్తులతో పాటు ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం వికారాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ఫైల్స్ రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు. పహానీల స్కానింగ్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాంరెడ్డిపల్లికి చెందిన కూకట్ల సత్తయ్య(55)ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై విజయ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 10, 2025
సంగారెడ్డి: పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఈనెల 11వ తేదీన ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల విధులకు వెళుతున్న పోలీసు అధికారులతో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కౌంటర్ ముగిసే వరకు వేటి వ్యక్తులు లోపలికి పంపించవద్దని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 10, 2025
రాంబిల్లిలో మిస్సైన టెన్త్ విద్యార్థుల ఆచూకీ లభ్యం

రాంబిల్లి(M) పంచదార్ల బీసీటీ స్కూల్ నుంచి మంగళవారం అదృశ్యమైన ఆరుగురు 10వ తరగతి విద్యార్థుల ఆచూకీ లభించింది. వారి కోసం జిల్లాలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరకు అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మిస్సింగ్ స్టోరీ సుఖాంతమైంది.


