News December 14, 2025
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.
Similar News
News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.
News December 14, 2025
భారత్లోనూ ఉగ్ర దాడులకు కుట్ర?

ఆస్ట్రేలియాలో <<18562319>>కాల్పుల<<>> నేపథ్యంతో భారత్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు టెర్రర్ గ్రూపులు కుట్ర చేస్తున్నట్లు తెలిపాయి. హనుక్కా పండుగ సందర్భంగా యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లను టార్గెట్గా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
News December 14, 2025
సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.


