News March 19, 2025

రీ స‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట‌: కలెక్టర్ 

image

జిల్లాలో స‌మ‌గ్ర భూ స‌ర్వేలో పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేస్తున్నామ‌ని, అత్యంత జ‌వాబుదారీత‌నంతో భూ లెక్క‌ల‌ను ప‌క్కాగా తేల్చేందుకే రీస‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ లక్ష్మీశ చెప్పారు. బుధ‌వారం ఆయన చంద‌ర్ల‌పాడు మండ‌లం, ఉస్తేప‌ల్లి గ్రామ ప‌రిధిలో జ‌రుగుతున్న గ్రామ స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ‌, రెండో ద‌శ రీస‌ర్వే డేటా సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల‌ను త‌నిఖీ చేశారు. ఆయన పలు శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు.

Similar News

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News November 7, 2025

నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

image

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 7, 2025

వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.