News January 2, 2026

రీ-సర్వే పూర్తయిన చోట్ల పాస్ పుస్తకాలు: జేసీ

image

భూ రీ-సర్వే పూర్తయిన చోట్ల రైతులకు పట్టాదారు ఈ-పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. గుర్రంకొండ మండలం, సంగసముద్రంలో జరిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రీ సర్వే జరిగిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వ చిహ్నంతో ముద్రించి ఇస్తున్నామన్నారు.

Similar News

News January 5, 2026

కుప్పంలో సత్ఫలితాలు ఇస్తోన్న CM విజన్.!

image

CM చంద్రబాబు ప్రత్యేక చొరవతో రాష్ట్రీయ ఆరోగ్య మిషన్ ద్వారా కుప్పంలో అమలు చేసున్న లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎదకొచ్చిన ఆవులకు లింగ నిర్ధారిత వీర్యం ఇంజెక్షన్లు వేస్తున్నారు. దీంతో కుప్పం(M) నూలుకుంటలో కృష్ణమూర్తికి చెందిన ఆవుకు ఉచిత ఫిమేల్ సీమెన్ పంపిణీ చేసి వేశారు. దీంతో ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడంతో కృష్ణమూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

News January 5, 2026

WGL: ఆశావహుల్లో రిజర్వేషన్ల టెన్షన్..!

image

మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12మున్సిపాలిటీల్లో 260 వార్డులు ఉన్నాయి. గతంలో పోటీ చేసిన వారితోపాటు అన్ని పార్టీల నుంచి పలువురు పోటీచేందుకు సిద్ధమవుతున్నారు.కానీ ఆశవాహుల్లో రిజర్వేషన్ గుబులు పుట్టిస్తోంది. ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ ఉంటుందా..మారుతుందా అన్న ఆందోళన ఆశావహులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

News January 5, 2026

నీళ్లు.. నిప్పులు!

image

ఉమ్మడి ఏపీలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రం ఏర్పడ్డాక AP, TG ప్రభుత్వాలు తమతమ సంపద సృష్టించుకుంటున్నాయి. ఎక్కడివారికి అక్కడే ఉద్యోగాలూ లభిస్తున్నాయి. కానీ నీళ్ల విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోంది. కృష్ణా జలాల్లో వాటా, ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటున్నారు. ఇవాళ SCలో నల్లమల సాగర్‌పై విచారణ జరగనుంది.